Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఆర్పీఎఫ్ నియామక పరీక్షపై తక్షణమే జోక్యం చేసుకోవాలి
- కేంద్ర హౌం మంత్రికి తమిళనాడు సీఎం లేఖ
చెన్నై: సీఆర్పీఎఫ్ నియామక పరీక్షను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో తమిళనాడు సీఎం సైతం ఇదే మాటను వినిపించారు. తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ విషయంలో అమిత్ షా తక్షణ జోక్యాన్ని స్టాలిన్ కోరారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం పరీక్షను కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్వహించాలన్న సీఆర్పీఎఫ్ నిర్ణయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించడం వల్ల హిందీ మాట్లాడని ప్రాంతాలకు చెందిన యువతకు పారామిలటరీ దళాల్లో సేవ చేసే అవకాశం సమానంగా లభిస్తుందని లేఖలో వివరించారు. హిందీ భాషలో పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయం ఏకపక్షం, వివక్షాపూరితమైనదని పేర్కొన్నారు. మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఆర్పీఎఫ్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.