Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైగర్ రిజర్వ్ నివేదికను విడుదల చేసిన ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో 3,167 పులులున్నాయనీ, వాటి సంఖ్య పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ 'దేశంలో టైగర్ రిజర్వ్ సారాంశ నివేదిక'ను విడుదల చేశారు. 'గణాంకాల ప్రకారం 2006లో 1,411 పులులు, 2010లో 1,706 పులులు, 2014లో 2,226 పులులు, 2018లో 2,967 పులులు, 2018లో 2,967 పులులుండేవి. నాలుగేండ్లలో 200 పెరిగాయి. 2022 నాటికి ఆ సంఖ్య 3,167 పులులకు పెరిగింది' అని చెప్పారు. నాలుగేండ్లలో ఈ సంఖ్య 6.74 శాతం పెరిగిందన్నారు. 2006తో పోల్చినపుడు ప్రస్తుతం పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు. మన దేశంలో పులులు, సింహాల సంరక్షణ కోసం పటిష్టమైన విధానాలను అమలు చేస్తున్నామన్నారు. సింహాల సంఖ్య 29 శాతం పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య 63 శాతం పెరిగిందన్నారు. 2014లో 7,910 చిరుతపులులు ఉండేవనీ, 2018లో 12,852కు వీటి సంఖ్య చేరిందని తెలిపారు. చీతాలు అంతరించిపోకుండా కాపాడటం కోసం 2022లో విదేశాల నుంచి మన దేశానికి చీతాలను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ట్రాన్స్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ జరగడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని తెలిపారు. వన్యప్రాణులు అభివృద్ధి చెందాలంటే, పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందడం చాలా ముఖ్యం, ఇది మన దేశంలో జరుగుతోందని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్ను మోడీ విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా విడుదల చేశారు. పులులు, చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, పూమాలు, జాగ్వార్ల వంటి ఏడు రకాల బిగ్ కేట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ కేట్ అలయెన్స్ను మోడీ ప్రారంభించారు. ఈ కూటమిలో దాదాపు 97 దేశాలున్నాయి. వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించిపోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టిసారించి పనిచేస్తుంది. ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగిన చర్యలను నిర్ణయిస్తుంది. నిధులను కూడా సమకూర్చుతుంది.