Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీని వెనక ఏమైనా కారణం ఉందా? :కేంద్రాన్ని ప్రశ్నించిన బాంబే హైకోర్టు
ముంబయి : ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు విషయంలో బాంబే హైకోర్టు సైతం స్పందించింది. దీనిని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నా రని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఐటీ నిబంధనలు, 2021లో సవరణలు చేయడానికి గల వివరణను న్యాయస్థా నం కోరింది. ఈ మేరకు కేంద్రానికి ఆర్డర్ జారీ చేసింది. కేంద్రం చేసిన సవరణల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మోడీ సర్కారును ప్రశ్నించింది. ఈ సవరణలు తీసుకురావ డానికి ఏదైనా కారణం ఉన్నదా? అని అడిగింది. అయితే, కేంద్రం తీసుకొచ్చిన సవరణలు భావస్వేచ్ఛను కలిపించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని ఉల్లంఘిస్తుందని కునాల్ కమ్రా తరఫు న్యాయవాది నవ్రోజ్ సీర్వారు కోర్టుకు తెలిపారు. కేంద్రం తన వైఖరిని తెలియజేస్తూ ఈనెల 19లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, కేంద్రం తీసుకొచ్చిన సవరణలు ఇంకా అమలులోకి రాలేదనీ, తమకు కొంత సమయం కావాలని కేంద్రం తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది.