Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భటిండా : పంజాబ్లో భటిండా ఆర్మీ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఒక జవాన్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ మేరకు ఇక్కడి కంటోన్మెంట్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు అందిందింది. బుధవారం ఉదయం భటిండా ఆర్మీ స్టేషన్పై దాడి జరగడంతో నలుగురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే జవాన్ ఆత్మహత్యకు ఉదయం జరిగిన సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని సైన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రీగా పనిచేస్తున్న ఒక జవాన్ బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడిచింది.