Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం నాలుగు స్థానాలకు పోటీ చేయనుంది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కమిటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. బాగేపల్లి స్థానం నుంచి డాక్టర్ అనిల్ కుమార్, కెఆర్ పురం నుంచి నంజేగౌడ, కెజిఎఫ్ నుంచి పి.తంగరాజు, కల్బుర్గీ నుంచి పాండురంగ మవినాకర్ను పోటీ చేయనున్నారు.15న బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బాగేపల్లిలో జరిగే సభకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నారు.