Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుపాకీతో కాల్చి.. అపై గొడ్డళ్లతో దాడి
న్యూఢిల్లీ: యుపిలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ రామారాజు శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో హత్యకుగురయ్యాడు. సందేశ్ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో అమేథి యూనివర్శిటీలో మెరైన్సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక అపార్టుమెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్తో కలసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 3:30ని.లకు అమన్ అనే తోటి విద్యార్ధి మరో యువకుడితో కలసి వచ్చి మొదటిగా తుపాకీతో కాల్చి, ఆ తరువాత గొడ్డళ్లతో దాడి చేశారని సందేశ్ మిత్రుడు నదీమ్ తెలిపాడు. తనపై కూడా దాడికి యత్నించగా తాను భయంతో వేరే గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నానని తెలిపాడు. తరువాత సందేశ్ను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని నదీమ్ చెప్పాడు. విషయం తెలుసుకున్న సందేశ్ తండ్రి శ్యామ్ సుందర్ ఢిల్లీ చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమారుడి మృత దేహాన్ని చూసి శ్యామ్ సుందర్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. హత్య చేసిన అమన్ కూడా అదే యూనివర్శిటీలో టూరిజం విద్యార్థిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందేశ్కు అమన్ మంచి స్నేహితుడు అని ఇద్దరూ అమేథీ హాస్టల్లో మొదటి సంవత్సరం కలసి ఉన్నారని తోటి స్నేహితులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారమా, మరేదైనా కారణమా అన్న కోణం నుంచి ఈకేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.