Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికీ ఆధార్తో లంకె పెడుతున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసినా కూడా సమాజంలోని అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాల ఫలితాలు చేర్చడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని మోడీ ప్రభుత్వం గట్టిగా తన వాదనను కోర్టుకు వినిపించింది. అయితే, ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలు గమనిస్తే, మోడీ తన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరాన్ని అవి సూచిస్తున్నాయి. సర్వేలో నిర్ధారణ అయిన విశేషం ఏమిటంటే అన్ని విధాలా ఆహార పదార్థాలను రేషన్ దుకాణాల ద్వారా అందుకోవలసిన వారికి పూర్తి అర్హతలు ఉన్నప్పటికీ, అవి లభించడం లేదు. కారణం ఆధార్ సమాచార నిక్షిప్త వ్యవస్థలోని లోపాలే. బయో మెట్రిక్ పద్ధతిలో అర్హులను గుర్తించేందుకు వేలిముద్రలు, కంటి పాప ముద్రలు సేకరించారు.
ఆ వివరాలను ప్రభుత్వ పంపిణీ బాధ్యతలు నిర్వహించే రేషన్ (చౌక) దుకాణాలలోని సాధనాలకు అమర్చారు. వాటి సాయంతో ని బోగస్, నకిలీ, బూటకపుు లబ్ధిదారులను ఏరివేయడానికి సాధ్యమవుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాల్లో (అనంతపురం, ప్రకాశం, నెల్లూరు) ని చౌక దుకాణాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతలను గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక ఆడిట్, జవాబుదారీతనం, పారదర్శకతల సొసైటీ (ూశీషఱవ్y టశీతీ ూశీషఱaశ్రీ Aబసఱ్, Aషషశీబఅ్abఱశ్రీఱ్y aఅస ుతీaఅరజూaతీవఅషy) కి అప్పగించారు. వారి అధ్యయనం ప్రకారం అత్యధిక సంఖ్యలో వాస్తవ లబ్ధిదారులు ఆహార ధాన్యాలను అందుకోలేకపోయారు. కారణం ఆధార్ నమోదులో ఇచ్చిన వేలిముద్రలకు, ఆధార్ సంఖ్యలకు సారూప్యత కుదరకపోవడమే. ఈ ఏడాది మే నెలలో మూడు జిల్లాల్లోని అయిదు చౌక దుకాణాల్లో ఈ అధ్యయనం జరిగింది. మూడు దుకాణాల్లో సగం కన్నా ఎక్కువ మందే ఈ విధంగా ఏ రేషన్ తీసుకోకుండానే వెను తిరిగిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఆధార్ వ్యవస్థలోని లోటుపాట్లు కూడా కొన్ని వెలుగు చూశాయి. చౌక దుకాణం దగ్గరకు వెళ్లిన ప్రతి లబ్ధిదారుడూ తనకు సంబంధించిన ఆధార్ గుర్తింపుతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ గుర్తింపు సంఖ్యలన్నిటినీ చెప్పి తాను అర్హుడైన వాడినే అని నిరూపించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో ఆ నెలలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 5358 ప్రభుత్వ పంపిణీ దుకాణాల ద్వారా 31 లక్షల మందికి ఆహార పదార్థాలు సరఫరా చేసింది. అయితే వారిలో 22 శాతం లేదా 6 లక్షల 87 వేల మందికి అవి పంపిణీ చేయడం సాధ్యం కాలేదు. 125 దుకాణాల్లో మొత్తం 85,589 మంది కార్డుదారులుండగా వారిలో 50,151 మంది అంటే 58 శాతం కోటా సరుకులు తీసుకోలేకపోయారు. ఈ ఫలితాలను గమనించిన సొసైటీ నమూనా అధ్యయనం (సర్వే) చేపట్టింది. మూడు జిల్లాల్లోని అయిదు షాపులను ఎంపిక చేసుకుంది. మిగిలిపోయిన కార్డుదారుల్లో 20 శాతం నమూనాగా పరిశీలించింది. చీమకుర్తి (ప్రకాశం జిల్లా)లో 82 మందిని ప్రశ్నించగా వారిలో 69 మంది సమాధానం ఒకటే. తాము కోటా సరుకులు తీసుకోలేకపోయాం అన్నదే. వేలి ముద్రలు సరిపోలకపోవడమే అందుకు కారణం అని వారు చెప్పారు. నెల్లూరు జిల్లాలోని 203 మంది కార్డుదారుల్లో 106 మంది, ఒంగోలు పట్టణంలోని 93 మందిలో 50 మంది ఇదే రకమైన సమాధానం ఇచ్చారు. వారందరి సమస్యా ఒక్కటే. ఇవి కాక మరికొన్ని రకాలైన ఇబ్బందులు కూడా వారు గమనించారు. మురికివాడల్లో నివసించే 35 మంది లబ్ధిదారులు వేరే చోట పనిచేసుకుంటున్న కారణంగా తమ బంధువులను పంపించి కోటా తెప్పించుకునేవారు. ఆధార్ పుణ్యమా అని వారికి ఆ సదుపాయం లేకుండా పోయింది. ఎందుకంటే - ఆధార్ అనుసంధానం కారణంగా లబ్ధిదారుడే స్వయంగా వెళ్లి తన సరుకును విడిపించుకోవాలి. ఒక్క ముదిగుబ్బలో మరో రకమైన వింత పరిస్థితి వారి దృష్టికి వచ్చింది. అక్కడ దుకాణం యజమాని కొంత మంది లబ్ధిదారులకు ఆధార్తో పనిలేకుండానే సరుకు ఇచ్చేశాడు. కాని ఆధార్ అనుసంధానిత సమాచారం ప్రకారం వాళ్లంతా ఇంకా రేషన్ అందుకోలేకపోయిన వారి జాబితాలోనే కొనసాగు తోంది. అంటే వాళ్లు నిబోగస్ లేదా బుటకపుు కార్డుదారులుగా మారిపోతారన్నమాట!