Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి మధ్యాహ్నం 12.35-1.43ల మధ్య
- నిర్మాణానికి జపాన్ బ్యాంకుతో నేడు చంద్రబాబు ఒప్పందం
- గ్రామాల సంప్రోక్షణ పూర్తి
విజయవాడ: రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12.35 గంటల నుంచి 1.43 గంటల మధ్య శంకుస్థాపన, బహిరంగ సభా కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సరిగ్గా 12.30 గంటలకు ప్రధాన వేదిక వద్దకు చేరుకుం టారు. అయిదు నిముషాల పాటు అమరావతి పెవిలియన్ ప్రదర్శనశాలను తిలకిస్తారు.12.35 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.45 గంటలకు ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రు లు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్తో సహా 15 మంది ప్రధాన వేదికపై ఆశీనులవు తారు.12.30 గంటల వరకూ శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లే ట్రాఫిక్ను మాత్రమే అనుమతిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యే ట్రాఫిక్ను మాత్రమే అనుమతిస్తారు. శంకు స్థాపనలో భాగంగా పూర్ణాహుతి, రత్నన్యాసం, నవరత్నాలు, శిలాన్యాసం, వేదాశీర్వాదం, శిలా ఫలక ఆవిష్కరణ, అనంతరం 12.48 గంటలకు మా తెలుగుతల్లికి...గేయంతో సభను ప్రారంభించనున్నారు. 12.50 నిమిషాల నుంచి 12.53 వరకు జపాన్ మంత్రి యెసుకి తగాకీ ప్రసంగించను న్నారు. 12.53 నుండి 12.56 మధ్య సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగిస్తారు. అనంతరం 12.56 నుండి 1.01 వరకూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు. అనంతరం రెండు నిమిషాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన అనంతరం 13.11 నిమిషాలకు ప్రధాని ప్రసం గం ప్రారంభమవుతుంది. 1.11 నుండి 1.43 వరకూ 32 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడనున్నారు. 1.45కు ప్రధాని బయలుదేరి వెళతారు. విఐపిల కోసం విజయవాడలో 500 పోలీసు వాహనాలు సిద్ధం చేశారు. బెంజ్, బిఎండబ్లు, ఆడి, ల్యాండ్రోవర్ వంటి కార్లతో పాటు సుమారు 100 ఎసి బస్సులనూ ఏర్పాటు చేశారు. భద్రత కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 14 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. మొత్తం పర్యవేక్షణ చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దీంట్లో ఉంటారు. ఎప్పటికిప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి సూచనలు చేస్తారు.
రాజధాని నిర్మాణం కోసం గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని హోటల్ గేట్వేలో జపాన్ మంత్రి యుసుకె తకాగితో చంద్రబాబునాయుడు ఎంఓయు కుదుర్చుకోనున్నారు. బుధవారం సాయంత్రమే జపాన్కు చెందిన సుమిటోమొ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులు విజయవాడకు చేరుకున్నారు. ఈ కార్యక్రమ కవరేజీ కోసం దేశ విదేశాల నుండి సుమారు 500 మంది మీడియా ప్రతినిధులు రానున్నారు. కోస్తా జిల్లాల నుండి వచ్చే వారిని మంగళగిరి మీదుగా, రాయలసీమ నుండి వచ్చేవారిని తాడికొండ, పల్నాడు, తెలంగాణా ప్రాంతాల నుండి వచ్చేవారిని అమరావతి నుండి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సుమారు 21 వైద్య, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు, దేశ, విదేశాల్లో పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చిన పవిత్రజలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రాజధాని గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా జల్లి సంప్రోక్షణ నిర్వహించారు. మిగిలిన మట్టితో 25 ఎకరాల్లో స్మారకకట్టడం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హిమాచలం, జెరూసలేం, మక్కా, స్వర్ణదేవాలయం వంటి పుణ్యక్షేత్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుండి సేకరించిన మట్టితో సంప్రోక్షణ చేయడం ద్వారా ఈ ప్రాంతం శకిమంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.45 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.