Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : అమరావతి నగర నిర్మాణంలో జపాన్ భాగస్వామిగా మారింది. అర్బన్ డెవలప్మెంట్, కృష్ణపట్నం పోర్టు అభివద్ధి, సూపర్ పవర్ థర్మల్, అగ్రికల్చరల్ టెక్నాలజీ తదితర రంగాలలో జపాన్ ఎపి కలిసి పని చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని అభివద్ధి, పారిశ్రామిక సహకారంపై జపాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ-ట్రేడ్ అండ్ ఇండిస్టీ (మేటి), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య గురువారం ఉదయం విజయవాడ హౌటల్ గేట్వేలో ఎంఓసి (మెమొరాండమ్ ఆఫ్కో-ఆపరేషన్) కుదిరింది. సిఎం చంద్రబాబునాయుడు, జపాన్ 'మేటి' మంత్రి యొసుకే టకాగి ఎంఓసిపై సంతకాలు చేశారు. రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివద్ధిపై ఏపీ ఆర్థికశాఖ, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ల మధ్య ఎంఓయు కుదిరింది. దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, జపాన్ బ్యాంక్ (జేబీఐసీ) సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ డిపార్టుమెంట్ డైరెక్టర్ జనరల్ నోరికోనసు సంతకాలు చేశారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన జపాన్ జైకా, జెట్రో, నెడో, జేబీఐసీ, ఎంఎల్ఐటీ, ఎంఏఎఫ్ఎఫ్ బందాలను చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్కు ఈ రోజు 'బిగ్డే' అని సిఎం వ్యాఖ్యానించారు. తూర్పు తీరానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖద్వారంగా మారనుందని జపాన్ 'మేటి' మంత్రి యొసుకే టకాగి చెప్పారు. రవాణా, మౌలిక సదుపాయాల కల్పనలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివద్ది చేయడానికి జపాన్ ముందుకొచ్చింది. దీనికి సాంకేతిక సహకారాన్ని జైకా అందిస్తుంది. పరస్పర సహకార పద్ధతిలో విజయవాడ మెట్రో రైలు సహా పలు మెట్రో ప్రాజెక్టులను అభివద్ధి చేయనున్నారు.