Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ మంత్రి ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఉన్నవ్(ఉత్తర ప్రదేశ్): భారతీయ జనతా పార్టీ బీఫ్ వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ ఆరోపించారు. బీఫ్ పై రాజకీయాలు చేస్తున్న బీజేపీ బీఫ్ ఎగుమతిదారుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు విరాళంగా స్వీకరించిందని ఆజంఖాన్ విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్న బీజేపీ ఆలయ నిర్మాణానికి సేకరించిన విరాళాల చిట్టా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గంగానది శుద్ధి గురించి ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ శుద్ధి ప్రక్రియను ఎప్సటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆజంఖాన్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆజం ఖాన్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది.రాంపూర్లో జరిపిన ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఖర్చులను ముందు బహిర్గతం చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి విజరు బహద్దూర్ పాఠక్ సవాలు విసిరారు. ములాయం జన్మదిన వేడుకలకు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లనుంచి నిధులు వచ్చాయని పాఠక్ ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన విరాళాల జాబితాలో 2013-2015 సంవత్సరాల్లో దాదాపు రూ.2కోట్ల 50లక్షలు విరాళంగా స్వీకరించినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్రిగోరిఫికో అల్లానా లిమిటెడ్, ఫ్రిగెరియో కన్వర్వా అల్లానా లిమిటెడ్, ఇందాగ్రో ఫుడ్స్ లిమిటెడ్ లాంటి బీఫ్ ఎగుమతి సంస్థల వద్ద బీజేపీ విరాళాలు స్వీకరించిందని కొన్ని పత్రికలు పేర్కొనడం విశేషం. ఈ సంస్థలు భారత్ నుండి 60ి పైచిలుకు దేశాలకు బీఫ్ను ఎగుమతి చేస్తున్నాయి. ఈ కంపెనీల ఏడాది టర్నోవర్ దాదాపు రూ.3,500కోట్లు అని కొన్ని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.