Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్పై 58 మంది ఎంపీల సంతకం
న్యూఢిల్లీ : 'రాజ్యాంగ విరుద్ధ' వ్యాఖ్యలు చేసిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జేబీ పార్డీవాలాను పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 58 మంది రాజ్యసభ సభ్యులు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించారు. హార్దిక్ పటేల్ కేసు విచారణ సందర్భంగా డిసెంబర్ 1న జస్టిస్ పార్డీవాలా రిజర్వేషన్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఈ దేశాన్ని రిజర్వేషన్లు, అవినీతి ఈ రెండే నాశనం చేశాయి' అని న్యాయమూర్తి తన తీర్పులో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు, 'మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రిజర్వేషన్లు పదేండ్లు కొనసాగు తాయని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు, దేశానికి స్వాతంత్రం వచ్చి 65 ఏండ్లు దాటినా ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి' అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న రాజ్యసభ సభ్యు లు ఆ న్యాయమూర్తిపై అభిశంసన చేపట్టాలని చైర్మన్కు అందించిన పిటిషన్లో కోరారు. పదేండ్ల కాలవ్యవధి ఎస్సీ, ఎస్టీ సముదాయాలకు చట్టసభలలో రిజర్వేషన్ గురించే తప్ప విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయంలో కాదని సభ్యులు తమ పిటిషన్లో అన్నారు. 'ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన విధానాల్లో రాజ్యాంగ నిబంధనల గురించి జస్టిస్ జేబీ పార్డీవాలాకు తెలియకపోవడం విచారకరం' అని సభ్యులు అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయ ప్రక్రియలో భాగం కాబట్టి, పైగా స్వభావ రీత్యా అవి రాజ్యాంగవిరుద్ధమైనవి కాబట్టి అతనిపై అభిశంసన చేపట్టడానికి తగిన ఆధారం ఉందని వారన్నారు.
ఈ పిటిషన్ను స్వీకరించామని, తమ పరిశీలనలో ఉందని రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ధ్రువీకరించింది. ఈ పిటిషన్పై సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్కు చెందిన ఆనంద్ శర్మ, దిగ్విజరు సింగ్, అశ్వనీకుమార్, పీఎల్ పునియా, రాజీవ్ శుక్లా, ఆస్కార్ ఫెర్నాండెజ్, అంబికా సోనీ, బీకే హరిప్రసాద్లతో పాటు డీ రాజా (సీపీఐ), కేఎన్ బాలగోపాల్ (సీపీఐ-ఎం), శరద్ యాదవ్ (జేడీ యూ), ఎస్సీ మిశ్రా, నరేందర్ కుమార్ కశ్యప్ (బీఎ స్పీ), తిరుచి శివ (డీఎంకే), డీపీ త్రిపాఠీ (ఎన్సీపీ) ఉన్నారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయాలంటే రాజ్యసభలో కనీసం 50 మంది, లోక్సభలో 100 మంది సభ్యుల సంతకాలు తప్పనిసరి. సభ్యులు తమ పిటిషన్తో పాటు డిసెంబర్ 12న అహ్మదాబాద్లో జరిగిన సమావేశపు తీర్మానం కాపీని కూడా జతచేశారు. ఆ సమావేశంలో చట్టసభల సభ్యులు, గుజరాత్ మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ సముదాయాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై అభిశంసన సహా అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. అంతకు ముందు, పార్లమెంటు హౌస్లో జరిగిన ఒక సమావేశంలో కూడా ఎస్సీ/ఎస్టీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జస్టిస్ జేపీ పార్డీవాలా వ్యాఖ్యలను ఖండించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాస్వాన్, థావర్చంద్ గెహ్లౌత్ కూడా పాల్గొనడం విశేషం. జస్టిస్ పార్డీవాలా డిసెంబర్ 1న ఇచ్చిన తీర్పులో హార్దిక్ పటేల్ ప్రభుత్వంపై యుద్ధం చేశాడనే ఆరోపణను కొట్టివేశారు. అయితే రాజద్రోహం కేసును మాత్రం కొట్టివేయలేదు.
ఆ న్యాయమూర్తిని తొలగించాలి : రాందాస్ అఠవలే
గౌరవ ప్రదమైన న్యాయమూర్తి పదవిలో ఉండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం చట్టవిరుద్ధమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్య క్షుడు రాందాస్ అఠవలే ఆరోపించారు. రిజర్వే షన్లపై గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జే.బి.పార్డీవాలా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అఠవలే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడితే విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ పద్ధతి దేశాన్ని నాశనం చేసిందన్న పార్డీవాలాను వెంటనే సస్పెండ్ చేయాలని అఠవలే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.