Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేఎన్యూలో జరుగుతున్న పరిణామాల వెనుక కుట్ర పన్నింది ఏబీవీపీ కార్యకర్తలేనని విద్యార్థులంటున్నారు. ఫిబ్రవరి 9న 'అఫ్జల్ గురు, మక్బూల్ భట్ల జ్ఞాపకార్థం' జరిగిందని ఆరోపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమంలో 'పాకిస్థాన్ జిందాబాద్' తదితర దేశ వ్యతిరేక నినాదాలు చేసింది లెఫ్ట్ విద్యా ర్థులు కాదని, ఆ నినాదాలు చేస్తున్న వారిలో ఏబీవీపీ వారున్నట్టుగా నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. వామపక్ష విద్యార్థులు ఆధిక్యంగా ఉన్న జేఎన్ యూ విద్యార్థి సంఘం ఈ నినాదాలతో లెఫ్ట్ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని, వారసలు జేఎన్యూ విద్యార్థులే కాదని గురువారం నాడే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం గమనార్హం. అరెస్టు కావడానికి కొన్ని నిమిషాల ముందు జేఎన్యూ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ చేసిన ప్రసంగం వీడియో కూడా సామాజిక మాధ్య మాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. అందులో కుమార్, తాము దేశానికి వ్యతిరేకులం కాదని, తమకు దేశభక్తి గురించి 'సంఫ్ు' దగ్గర పాఠాలు చెప్పించుకునే గతి పట్టలేదని, తాము రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేసి, జేఎన్యూలో కాషాయ విద్వేషాన్ని వ్యాపింపజేయ డానికే సంఫ్ు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపిం చారు. ఇక శనివారం ముందుకు వచ్చిన వీడియోలో 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినా దాలుచేస్తున్న వారిలో కొందరు ఏబీవీపీ వారే అని నిరూపించే విజు వల్ సాక్ష్యాధారాలు బైటపడ్డాయి. ఒక టీవీ ఛానెల్ ఈ వీడియోను ప్రసారం చేసింది. ఫిబ్రవరి 9 నాటి కార్యక్రమంలో 'జాతి వ్యతిరేక' నినాదాలు చేస్తూ కనిపించిన ఒక యువతి, ముగ్గురు యువకులు, వేరే విజువల్స్లో ఏబీవీపీ ధర్నా లలో కూడా స్పష్టంగా కనిపించడం గమనార్హం. అంటే ఏబీవీపీ వాళ్లు కావా లనే, వామ పక్ష విద్యార్థి సంఘాలను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే 'జాతి వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలకు ఈ వీడియో బలం చేకూరుస్తుంది. హైదరాబాద్లోని హెచ్సీ యూలో దళిత, వామపక్ష విద్యా ర్థులను 'దేశద్రోహులు' గా ముద్ర వేసినట్టుగానే, జేఎన్ యూలో కూడా కాశ్మీరీ అంశాన్ని సాకుగా తీసుకొని వామపక్ష విద్యార్థి సంఘాల గొంతు నొక్కాలని ప్రయత్ని స్తున్నారని విద్యార్థి నేతలు అంటున్నారు. వివాదాస్పద నినాదాలకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా, దానిపై విచారణ జరిపించకుండా విద్యార్థులను అరెస్ట్ చేయడం, క్యాంపస్లో పోలీసులతో కూంబిం గ్లు జరిపించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అంటున్నారు.