Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంను కోరిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: దావూద్ సోదరి తమ ఆస్తులకు తగిన ఆధారాలు చూపలేపోయారని పేర్కొంటూ ముంబరులోని దావూద్ ఇబ్రహీం సోదరి, ఇతర బంధువుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీం కోర్టును ప్రభుత్వం కోరింది. ముంబయిలోని దావూద్కు చెందిన నాగ్పాడా బంగ్లాను అతని తల్లి అమీనా బి కస్కర్ (ఇప్పుడు లేరు), సోదరి హసీనా ఇబ్రహీం పార్కర్ స్వాధీనం చేసుకున్నారని, కనుక దాన్ని జప్తు చేయడానికి న్యాయ సహాయం అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 1993లో ముంబరు బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ దేశం విడిచి పారిపోయాడు. అతని ఆస్తులను జప్తు చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని తల్లి, సోదరి అడ్డుకున్నారు. 1998లో ఆస్తుల జప్తు ఆదేశాలను సవాల్ చేస్తూ అమీనా, హసీనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాంతో యథాతథ స్థితిని అమలు చేయాలంటూ జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచి 2012 నవంబర్లో ఆదేశించింది. అమీనా పేరు మీద రెండు, హసీనా పేరు మీద ఐదు నివాస సముదాయాలు ఉన్నాయి. అమీనా మరణానంతరం ఆ ఆస్తులు ఆమె వారసులకు దఖలుపడ్డాయి. ఈ ఆస్తులన్నీ దావూద్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా చేకూర్చుకున్నవే అని భావిస్తున్నారు.
తల్లీకూతుళ్లు వేసిన అప్పీళ్ళను సవాల్ చేస్తూ ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.