Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటీ:అత్యున్నత న్యాయస్థానం
- సుప్రీంకు సీల్డ్ కవర్ లో సీబీడీటీ నివేదిక
న్యూఢిల్లీ : లోక్సభలో ఉన్న ఏడుగురు ఎంపీల విషయంలో అక్రమాస్తులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సుప్రీం కోర్టుకు సమర్పించింది. వీరిపై దర్యాప్తు జరపవలసి ఉందని బోర్డు కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సీబీడీటీ సోమవారం కోర్టుకు సీల్డ్కవర్లో సమాచారం అందించింది. ఈ సందర్భంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేల ఆస్తులపై దర్యాప్తు జరుగుతోందని కోర్టుకు వివరించింది. మంగళవారం నాడు కోర్టుకు అందించిన వివరాల్లో ఆదాయ వనరులకన్నా అధికంగా ఆదాయం ఉన్న వారి వివరాలు అందించింది. ఈ వివరాలను కోర్టు తిరస్కరిస్తూ అసమగ్రంగా ఉందని, విచారణ జరుగుతోందా లేదా అన్న అంశంపై కోర్టు నిలదీసింది. ప్రభుత్వం వారిపై తీసుకున్న చర్యల గురించి నేరుగా ప్రభుత్వాన్నే ఆదేశించాలని సీబీడీటీ కోర్టుకు తెలిపింది. రెండు ఎన్నికల మధ్య కాలంలో దాదాపు 500 శాతం వరకు ఆస్తులు పెంచుకున్న నాయకుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది. 26 మంది లోక్సభ ఎంపీల్లో 11 మంది రాజ్యసభలోనూ, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 257 మంది అక్రమ ఆస్తులు కూడబెట్టారని సీబీడీటీ వివరించింది. వారిలో 98 మంది ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగిందన్న విషయాన్ని సీబీడీటీ గుర్తించింది.వీరి ఆస్తుల విషయంలో ఇన్కంటాక్స్ అధికారులు దర్యాప్తు చేస్టున్నట్టు కోర్టుకు వివరించింది. వీరిపై దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చింది. ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో ఎన్నికల సమయంలో ఆస్తుల వెల్లడి సమయంలో అభ్యర్థులు తమ ఆదాయ వనరుల గురించిన వివరాలు కూడా జతపరిచేలా నిబంధనలు రూపొందించాలని కోరింది.