Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో విద్యార్థుల భద్రతకు సం బంధించి దాఖలైన పిటిషన్పై విచా రించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. విద్యార్థుల భద్రత కోసం మార్గ దర్శకాలను సూచించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు అభా శర్మ, సంగీత భారతి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక కొన్ని మార్గదర్శకాల ప్రతిపాదనలు సైతం పేర్కొన్నారు. కాగా.. ఈ పిటి షన్పై ఈనెల 15న(శుక్రవారం) విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు అమితవరారు, ఎఎం ఖాన్విల్కర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.