Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయ్పూర్ : 20 ఏండ్ల గిరిజన మహిళపై ఇద్దరు మైనర్లు సహా పది మంది ఘాతుకానికి ఒడిగట్టిన ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగులోకి వచ్చింది. లైంగికదాడికి పాల్పడిన అనంతరం ఆమెను ఒక కాలువలో పడేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తమ స్నేహితులతో కలసి ఇద్దరు మహిళలు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా కైకచ్చర్, హత్కల్టా గ్రామాల మధ్యగల అటవీ ప్రాంతంలో ఈ నెల 5న ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాగా, 9వ తేదీన బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం నిందితులను అరెస్టు చేశారు. ఇంటికి తిరిగివస్తున్న వారిని వెంబడించారని, వీరి పారిపోతుండగా... మహిళను పట్టుకొని తీవ్రంగా కొట్టి.. ఐదుగురు లైంగికదాడికి పాల్పడ్డారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అనంతరం ఇద్దరు మైనర్లు సహా మరో ఐదుగురు దారుణానికి పాల్పడ్డారని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమెను పక్కనున్న చిన్న నదిలో పడేశారని తెలిపారు. నీళ్లు తక్కువగా ఉండటంతో... ఆమె ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు.