Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామినాథన్ సిఫారసులు అమలుచేయాలి
- రాజస్థాన్లో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ
సికార్ (రాజస్థాన్): రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్చేస్తూ బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో రైతులుమరోసారి ఉద్యమించారు. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అఖిల భారత కిసాన్సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన భారీ ర్యాలీలో దాదాపు 15 వేల మందికి పైగా రైతులు పాల్గొన్నారు. పూర్తి స్థాయి వ్యవసాయ రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పశువుల క్రయ విక్రయాలపై నిషేధం తొలగింపు, పాడి లేని పశువుల విషయంలో సమస్యకు పరిష్కారం, రైతులకు పెన్షన్ సౌకర్యం వంటి డిమాండ్లతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు అంగన్ వాడీ వర్కర్లు, వ్యాపారులు, రవాణా రంగానికి చెందిన వివిధ యూనియన్లు మద్దతు ప్రకటించగా, రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ అధికసంఖ్యలో యువత ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రైతులకు ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామని, కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయానికి తక్కువగా వుంటే కొనుగోలు సమయంలో బోనస్ ప్రకటిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, ఇప్పుడవన్నీ ఎక్కడికి పోయాయని రైతు నేతలు ప్రశ్నించారు. పాల ఉత్పత్తి దారులకు సబ్సిడీలు కల్పిస్తామన్న బీజేపీ హామీ గాలిలో కలిసిపోయిందని విమర్శించారు. మోడీ సర్కారు ప్రకటించిన పశువుల క్రయ, విక్రయాలపై నిషేధంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రైతులు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.