Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అధికారంలో వచ్చాక..ఎడాపెడా పెరుగుతున్న ఇంధనధరలు
-రోజూ ధరల నిర్ణయంతో సామాన్యుడు బెంబేలు
న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు రోజువారీ సవరణల పేరుతో నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న ప్రయోగం సామాన్య వినియోగదారుల నెత్తిన పెద్ద బండగా మారిపోయింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక..ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బడువు జీవుల జేబులకు చిల్లులు పడుతూనే ఉన్నాయి. ఇటీవల పెట్రో,డిజీల్ ధరలను రోజువారీ రేట్ల మార్పు అన్నది విధానపరమైన నిర్ణయంగా కనిపించినా, వినియోగదారు నెత్తిన మాత్రం ప్రతీ రోజూ అద నపు భారాన్ని మోపడానికే ఉపయోగపడు తోంది. ఇదివరలో రెండు వారాల కోసారి చేసే సమీక్ష పేరుతో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన ప్రతీసారి ప్రజల నుంచి నిరసన కూడా వ్యక్తమ య్యేది. ఇప్పుడు ఏ రోజుకారోజు మార్చివేస్తున్న రేట్ల కారణంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువత్తే అవకాశం లేకుండా పోతోంది. ఇది ప్రజలకున్న నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. ఇది చాలక గతంలో వాజ్పేయి హయాంలో ధరల నిర్ధారణను మార్కెట్ ప్రభావానికి వదిలేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ హయాంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ మారిపోయి జనానికి వాతలు పెడుతున్నది.
పెట్రో ధరల్లో మార్పుల తీరును పరిశీలిస్తే ...
2012లో మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70 ఉండేది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ (సుమారుగా 3789 లీటర్లు) పెట్రోల్ ధర 120 డాలర్లు (అంటే ఇప్పటి మారకం రేటు ప్రకారం రూ. 7620 మాత్రమే). ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధర బ్యారెల్కు 50 డాలర్లకు చేరినా కూడా ఢిల్లీలో మనకి రూ. 70 కే విక్రయిస్తున్నారు. హైదరాబాద్లాంటి కొన్ని నగరాల్లో ఇది రూ. 74కు చేరింది. మనదేశంలో గిరాకీ ఉన్న పెట్రోల్ ఉత్పత్తుల్లో దాదాపు 80 శాతం దిగుమతులు చేసుకున్నదే. ఈ వాస్తవం ఆధారం చేసుకుని ఇదివరలో ధరలు పెంచినప్పుడల్లా అంతర్జాతీయ మార్కెట్లో రేట్ల పెరుగుదల కారణమని సాకు చెప్పేదు. కాని ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా తగ్గిపోయినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడం లేదు.
ఈ సందర్భంలో పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరల తీరు గమనించడం అవసరం. పాకిస్తాన్లో కేవలం పెట్రోల్ ధర లీటర్కు రూ. 57, డీజిల్ ధర రూ. 46 ఉంది. ఢిల్లీలో డీజిల్ లీటర్ ధర రూ. 58 లు వసూలుచేస్తున్నారు. ఇక శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 50, డీజిల్ ధర 40, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో రూ. 33 (పెట్రోల్), రూ. 41 (డీజిల్) కు దొరుకుతుంది.
మరి మన దేశంలో ఇంత అధికంగా రేట్లు ఉండటానికి కారణం ఏమిటంటే - పెట్రో ఉత్పత్తులపై వసూలు చేసే పన్నులు దాదాపు 45 నుంచి 52 శాతం వరకు ఉండడమే. నిజానికి పెట్రోల్ ఉత్పత్తులకు జీఎస్టీ అమలు చేసి 28 శాతం టాక్స్ విధించినా ఇంతకంటే తక్కువ ధరలకే వినియోగదారులకు అందచేయవచ్చు. మోడీ ప్రభుత్వం ఎక్సైడ్ డ్యూటీని 2014-16 మధ్య కాలంలో ఆరు సార్లు పెంచుకుంటూ పోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు లీటరుకు పెట్రోల్పై రూ. 9.48, డీజీల్పై రూ. 3.56 ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు అది ఒక లీటర్కు పెట్రోల్పై రూ. 21.48, డీజిల్పై రూ. 17.33కు చేరింది. అంటే 2014 నాటి పన్నుల భారంతో పోలిస్తే ఇప్పుడు పెట్రోల్పై 226 శాతం, డీజిల్పై 486 శాతం అదనంగా ఎక్సైజ్ పన్నుల భారం పడింది.