Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పంపిణీ చేసేందుకు కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది. గతంలో ఇరు రాష్ట్రాలు సమర్పించిన 26అంశాల ప్రాతిపదికగా విచారణ చేపట్టేం దుకు జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అదేసమయంలో ఈ అంశాలపై ఇరు రాష్ట్రాలకు ఏమైనా అభ్యంతరాలుంటే కౌం టర్ అఫిడవిట్లు సమర్పించాలని గత విచారణలో ఆదేశిం చింది. అందులో భాగంగా బుధవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యు నల్ సమావేశమైంది. తెలంగాణ నుంచి సీనియర్ న్యాయ వాది వైద్యనాథన్, ఏపీ నుంచి సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ ట్రిబ్యునల్కు హాజరయ్యారు. గతంలోని 26 అంశాలపై ఉదయం కొద్దిసేపు వాదనలు జరిగాయి. ము ఖ్యంగా తెలంగాణలో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాంతాలకు నీటి కేటాయింపులను ఒకే పంటకు పరిమితం చేయాలన్న ఏపీ వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే మిగుల జలాల పేరిట విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలన డంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సాగునీరు కేటాయించొద్దన్న ఏపీ వాదనను సైతం తప్పుపట్టింది. అలాగే ముసాయిదా అంశాల్లో దొర్లిన ప్రింటింగ్ తప్పులను సవరించారు. కాగా ఈ అంశంలో పూర్తిస్థాయి విచారణ చేప ట్టే ముందు తమకు మరికొంత గడువు ఇవ్వాలని తెలంగాణ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు జస్టిస్ బ్రిజేష్కుమార్ అంగీకరించలేదు. అయితే మొదటి రోజు(బుధవారం) విచారణ మినహాయింపునిచ్చారు. గురువారం నుంచి విచారణ యథాతథంగా జరగుతుందని స్పష్టం చేశారు. 2013లో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కృష్ణా జలాలను ట్రిబ్యునల్ కేటాయించింది. ఆ నీటిని విభజన అనంతరం తెలంగాణ, ఏపీకి ఎలా కేటాయించాలన్న అంశంపై నేటి నుంచి విచారణ ప్రారంభంకానుంది.
నేరడి బ్యారేజీ నిర్మాణంపై
వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు
నేరడి బ్యారేజీ నిర్మాణంపై వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది. నేరడి బ్యారేజీని ఏపి ప్రభుత్వం కట్టుకోవచ్చని ట్రిబ్యునల్ చెప్పింది. గొట్టా బ్యారేజీలో 115 టిఎంసిల నీటి నిల్వలను చెరిసగం వాడుకోవాలని ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు సూచించింది. మే 31న బ్యారేజ్ గేట్లు మూసి వేయాలని ఆదేశించింది. ఆయకట్టు ఆధారంగా రెండు రాష్ట్రాలు ఖర్చు భరించాలని పేర్కొంది.