Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన అడ్మినిస్ట్రేటర్
న్యూఢిల్లీ: గుర్గావ్లో ఏడేండ్ల బాలుడి దారుణ హత్య కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ ఫ్రాన్సిస్ థామస్ బుధవారం భారత సర్వోన్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించారు. ఈనెల 8న.. రెండో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రధుమ్యాన్ ఠాకూర్ హత్య జరగగా 10న థామస్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. గుర్గావ్, సోహ్నాలోని న్యాయవాదులెవరూ తన తరఫున వాదించేందుకు సిద్ధంగా లేరని, కాబట్టి కేసు విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని థామస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుల తరఫున ఎవ్వరూ వాదించొద్దని ఈనెల 9న గూర్గావ్లోని బార్ అసోసియేషన్స్ నిర్ణయం తీసుకున్నాయి.