Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
భోపాల్ : మధ్యప్రదేశ్లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బహిరంగ బహిరంగ మలవిసర్జన చేశాడని... ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. అసిస్టెంట్ టీచర్ను సస్పెండ్ చేస్తూ అశోక్నగర్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేంద్ర సింగ్ యాదవ్ ప్రభుత్వ పాఠశాలలో అసిసెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. అశోక్నగర్ జిల్లా సిల్వాతి వాసి అయిన మహేంద్ర సమీప గ్రామం భుదెహెరలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.
'ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ మిషన్ను మహేంద్ర సింగ్ అతిక్రమించారు. ఇన ఇంట్లో టాయిలెట్ ఉన్నప్పటికీ, బహిరంగ విసర్జన చేశారు. అందుకే అతనిని సస్పెండ్ చేస్తున్నాం' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.