Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ సిటిజన్లపై ప్రభుత్వ విధానాలు అధ్వానం: ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలో ఎకె.పద్మనాభన్
విశాఖపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన సీనియర్ సిటిజన్లకు సామాజిక భద్రత ఉండడం లేదనీ, సామాజిక భద్రత అనేది వారి హక్కు అని అందుకు సంబంధించిన చట్టాలను ప్రభుత్వాలు చేయాలని ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ట్రస్టు బోర్డు మెంబరు ఎకె.పద్మనాభన్ డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు దాటినా పెన్షనర్లు, రిటైర్డ్ పర్సన్ల జీవన భద్రతకు సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. సోమవారం విశాఖలోని ఎయు అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో 'ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్' ప్రథమ మహాసభను ఎకె.పద్మనాభన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన హక్కని, ఉదారంగా ఇచ్చేది కాదని అన్నారు. 1995లో నిర్ణయించిన పెన్షన్ విధానాన్నే రాష్ట్రంలోనూ ఇస్తుండడం దుర్మార్గమన్నారు.
ఏపీిఆరపీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
శాస్త్రి, సుధాకరరావు
ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (ఏపీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్ఎ.శాస్త్రి (విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా కె.సుధాకరరావు (విశాఖ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా పి.అజరు కుమార్ (విజయవాడ), ఉప ప్రధాన కార్యదర్శిగా బివిఎస్.రాజు (కడప), కోశాధికారిగా సీిహెచ్. సత్యనారాయణరాజు (కాకినాడ), ఉపాధ్యక్షులుగా కెఎస్. కోటేశ్వర రావు (కృష్ణా), బాబూప్రసాద్, కార్యదర్శులుగా వై.నాగభూషణం (విజయవాడ), శేషగిరి (విజయనగరం) ఎన్నికయ్యారు.