Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: టిటివి దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్ పి.ధనపాల్ అనర్హత వేటువేశారు. సోమ వారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఓ ప్రకటనలో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్.రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు ఆగస్టు చివరి వారంలో ఈ ఎమ్మెల్యే లందరికీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చీఫ్ విప్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.