Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిపైనే లైంగికదాడి
- మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదని...
ముంబయి : కన్న కొడుకు రాక్షసుడుగా మారాడు. మద్యం మత్తుకు బానిసైన అతడు.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. చివరకు 55 ఏండ్ల కన్నతల్లిపైనే కాటేశాడు. ఇలాంటి అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదని భావించిందా తల్లీ. తన చిన్న కొడుకును హతమార్చేందుకు ప్లాన్ వేసింది. రూ. 50 వేలు సుపారీ ఇచ్చి ఆ పని పూర్తిచేయించింది. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. ఒక మహిళ, ఆమె మరో కుమారుడు, సహకరించిన కొందరిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆరు నెలలుగా కొడుకు రామ్చరణ్ ద్వివేది (22) వేధింపులతో విసిగిపోయిన రజిని అతడిని హతమార్చేందుకు మరో కుమారుడితో కలిసి ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 21న ఒక గుర్తు తెలియని మృతదేహం ఓ క్వారీలో లభించింది. ఆ మృతుడి మెడమీద గాయాలుండటంతో హత్యకేసు నమోదుచేసిన ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రామ్చరణ్, రజినీ అని అతడి చేతులమీద టాట్యూకూడా వేసి ఉంది. పాల్గఢ్, థానే, ముంబయి, నవీ ముంబయి తదితర అన్ని పోలీస్ స్టేషన్లకు అతడి ఫొటోలను పంపించారు. దాదాపు నెలకావస్తుండగా.. గుర్తుపట్టినట్టు ఎవరూ ముందుకురాలేదు. చివరకు కేసు మూసివేసే దశలో ఉండగా... సునీతా శర్మ అనే మహిళ అతడిని గుర్తుపట్టింది. అతడు రామ్చరణ్ అని భయందర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్యాప్తు బృందం రామ్చరణ్ ఇంటికి వెళ్ళి కూపీ లాగడంతో విషయం బయటపడింది. రామ్చరణ్ను చంపేందుకు సీతారామ్ అనే వ్యక్తికి రూ. 50 వేలు ఇచ్చినట్టు ఒప్పుకుంది.