Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 43 కుటుంబాలకు నోటీసులు
బెటుల్(ఎంపీ) : మధ్యప్రదేశ్లో విస్మయకర ఘటన వెలుగుచూసింది. బహిరంగ మలవిసర్జనకు వెళ్ళారని జరిమానా విధించారు. అది వందో.. వెయ్యో కాదు.. ఏకంగా రూ. 75 వేలు ఫైన్ విధించింది ఆ గ్రామ పంచాయితీ. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇదే రాష్ట్రంలోని గ్వాలియర్ మున్సిపల్ బాడీ బహిరంగ మలవిసర్జనకు వెళ్ళే వారి ఫొటో తెస్తే రూ. 100 బహుమానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకపక్క దీనిపై వివాదం నడుస్తుం డగా... రామ్బఖేడీ గ్రామ పంచాయితీ ఏకంగా ఒక కుటుంబా నికి రూ. 75 వేలు జరిమానా విధించింది. ఇదే గ్రామంలోని మరో 43 కుటుం బాలకు నోటీసులు జారీచేసింది. 'నెల రోజుల కిందట ఆ కుటుంబ సభ్యుల ను ఆదేశించాం. అయితే మా ఆదేశాలను ఆ కుటుంబసభ్యులు పట్టించు కోలేదు. అందువల్ల రూ. 75 వేలు జరిమానా విధించాం' అని రామ్బఖేడీ పంచాయితీ సభ్యుడు కున్వర్లాల్ చెప్పారు. ఆ కుటుంబంలో పదిమంది సభ్యులున్నారనీ, ఒక్కొక్కరికీ రోజుకు రూ. 250 చొప్పున, నెల రోజుల్లో ఆ జరిమానా మొత్తాన్నీ చెల్లించాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.