Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో మరణశిక్ష పడిన దోషులను ఉరి తీయవద్దని కోరుతూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు న్యాయవాది రిషీ మల్హోత్రా దాఖలు చేశారు. ఉరికి బదులు షూటింగ్(కాల్చి చంపడం) లేదంటే ప్రాణాంతక ఇంజక్షన్లను ప్రయోగించాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దేశంలో మరణశిక్ష పడిన దోషులను ఉరి తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఉరి తీస్తే ఆ బాధ ఎక్కువ సేపు ఉంటుందని మల్హోత్రా అన్నారు. దీనికి బదులు షూట్ చేసినా, ప్రాణాంతక ఇంజక్షన్లను ప్రయోగించినా తక్కువ బాధతో కొద్ది నిమిషాల్లోనే ప్రాణం పోతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు దేశాలు ఉరితీత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో షూటింగ్, ప్రాణాంతక ఇంజక్షన్ల ప్రయోగాన్ని తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు.