Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్, అమృత్సర్: పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్ వద్ద పాక్ రేంజర్లు బుధవారం ఉదయం కాల్పులు జరిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన జవానును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడించారు. మరో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
ఇద్దరు చొరబాటుదారులు హతం
పంజాబ్ సరిహద్దు గురడా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ ఎఫ్) మట్టుబెట్టింది. అమృత్సర్లోని అంజాలా సెక్టార్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నియంత్రణ రేఖ వద్ద కొందరు తచ్చాడుతూ కనిపించారు. వారు దేశంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా జవాన్లు కాల్పులు జరిపారు. ఘటనలో మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.