Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 78 రోజలు బోనస్ ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా కానుకను ప్రకటించింది. 78 రోజుల ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ (పీఎల్బీ)ను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం తెలిపారు. ఢిల్లీలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. దసరా పండగకు ముందే బోనస్ను చెల్లిస్తామని ఆయన చెప్పారు. దాదాపు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ను అందుకోనున్నారు.