Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైనరుపై దగ్గర బంధువు..కడుపులో బిడ్డ మృతి
చెన్నై: ముంబయిలో మద్యం మత్తులో మదమెక్కి సభ్యసమాజం సిగ్గుపడేలా తల్లిపైనే లైంగికదాడి పాల్పడిన ఘటన మరువకముందే... మైనరుపై సమీప బంధువే దారుణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్ ఆస్పత్రిలో 13 ఏండ్ల బాలికకు కడుపులోనే బిడ్డ చనిపోగా.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆమెను తల్లిదండ్రులు, వైద్యులు ఆరాతీయగా.. సమీప బంధువు తనపై పలుమార్లు అఘాయిత్యం చేసినట్టు బాలిక చెప్పింది. తీవ్ర కడుపునొప్పితో బాధపుడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకురాగా... ఆమె గర్భవతి అని తేలింది. గర్భంలోని శిశువు మృతిచెందడంతో ఇన్ఫెక్షన్ కూడా సోకిందని వైద్యులు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ఇందిరన్ను పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
యూపీలో బాలికపై సామూహిక లైంగికదాడి, హత్యాయత్నం
వరుస లైంగికదాడి ఘటనలు వెలుగుచూస్తున్న యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. సమీప అటవీ ప్రాంతం వద్దకు బహిర్భూమికి వెళ్ళిన 12 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసేందుకు తీవ్రంగా కొట్టారు. సహరన్పూర్లోని డియోబంద్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.