Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప:స్కూల్బస్సును మినీలారీ ఢకొీన్న ప్రమాదంలో ఎల్కేజీ విద్యార్థి దుర్మరణం చెందాడు. యశస్వినికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన కడప-కర్నూలు ప్రధాన రహదారిపై దువ్వూరు మండలం మీర్జాఖాన్పల్లె వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుడిపాడు గ్రామానికి చెందిన గురు శంకరాచార్య ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు ఉదయం స్కూల్ పిల్లలను ఎక్కించుకొని వెళ్తుండగా మీర్జాఖాన్పల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ కొరియర్కు చెందిన మినీలారీ ఢకొీంది. ఈ ప్రమాదంలో మండలానికి చెందిన కటికపల్లె గ్రామంలో వరదారెడ్డి కుమారుడు నాలుగేండ్ల నవీన్కుమార్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.