Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
కోల్కతా: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అస్తవ్యస్తమైన అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకను విరిచేసిందని, ఆర్థిక 'తిరోగమనా'నికి మోగఅ ప్రభుత్వమే బాధ్యతవహించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగాలు ఓటమిని గుర్తుచేస్తూ ఎన్డీయే ప్రభుత్వానికి కౌంట్డౌన్ ఇప్పటికే షురూ అయ్యిందన్నారు. కోల్కతా వచ్చిన ఏచూరి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 'రుణ భారాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి దీనిపై పూర్తిగా అవగాహనే లేదు. పూర్తిగా విస్మరించింది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు' అని ఆరోపించారు. ఆర్థికవృద్ధి వెనుకబాటుకు 'సాంకేతిక కారణాలవల్లే' అంటూ దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు బీజేపీ, మంత్రులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జేఎన్యూలో వామపక్ష కూటమి, డీయూఎస్యూ ఎన్నికల్లో ఏబీవీపీని ఓడించి ఎన్ఎస్యూఐ రెండు స్థానాల్లో విజయం సాధించడాన్ని పేర్కొంటూ.. 'దేశంలో మారుతున్న వాతావరణానికి ఈ ఫలితాలు ప్రతిబింబం. మోడీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైనందని నేను చెప్పగలను' అన్నారు. 'బీజేపీ మతతత్వం దేశ లౌకికవర్గాలకు ప్రధాన ముప్పు' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలవల్లే బీజేపీ అధికారంలోకి రాగలిగిందన్నారు. దుర్గా విగ్రహాల నిమజ్జనంపై తలెత్తిన వివాదంపై మాట్లాడుతూ ఇలాంటి నిర్ణయాలు బెంగాల్లో టీఎంసీ, బీజేపీ 'పోటీ మతోన్మాదం' ప్రతిబింబాలని చెప్పారు.