Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు రప్పించే బాధ్యత అధికారులు, మంత్రులదే : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి
- ఎన్నికల సీజన్లో కుదరదు..ఇప్పుడే గట్టిగా యత్నించాలి
అమరావతి:నిధులు లేవని సంస్థల ఏర్పాటు ఆగడానికి వీల్లేదు కేంద్రం ప్రకటించిన సంస్థలకు నిధులు రాక పోతే ఎలా? కేంద్రాన్ని అడగండి.. ఆ బాధ్యత అధి కారులే తీసుకోవాలి.. అంటూ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడున్నరేళ్లు గడిచిపోతోందని, ఇప్పుడు అడక్క పోతే, ఇక ముందు అడగలేమని అన్నారు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా చివరి రెండోరోజు గురు వారం సీఎం పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమం, విద్య, క్రీడలు, పట్టణాభివృద్ధి, రాజ ధాని, వైద్య, ఆరోగ్య, అటవీశాఖ పనితీరుపై సమీ క్షించారు. పలు విభాగాల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల్లో కదలిక ఉండటం లేదన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.