Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రైళ్లలో బుకింగ్ చేయని సామగ్రి పోగొట్టుకున్న ప్రయాణికులకు పరిహారం ఇప్పించడం కుదరదని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మమత అగర్వాల్ 2011లో లోక్మాన్య తిలక్ షాలీమర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తుండగా రూర్కెలా చేరుకున్నాక ఆమె బ్యాగు అపహరించారు. దానిలో సుమారు రూ.3 లక్షల విలువ చేసే సామగ్రి ఉందని, తనకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైల్వే అధికారులను ఆమె కోరారు. అందుకు స్పందించకపోవడంతో జిల్లా వినియోగదారుల ఫోరంలో నష్టపరిహారం చెల్లించాలని ఆ ఫోరం ఆదేశించింది. దీనిని ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిషన్ సమర్థిస్తూ పరిహారంగా రూ.1.30 లక్షలను చెల్లించాలని రైల్వేశాఖను ఆదేశించింది. చివరకు వివాదం జాతీయ కమిషన్కు చేరింది. విచారణ జరిపిన కమిషన్ బుకింగ్ చేయని సామగ్రికి రైల్వే బాధ్యత వహించదని పేర్కొంటూ రైల్వే చట్టం 1989, సెక్షన్ 100ను ప్రస్తావించింది. ఇందులో రైల్వే అధికారుల సేవల్లో ఎలాంటి లోపం లేదని, వారి చట్టం అన్నిరకాలుగా సమర్ధించదగినదని విచారణ బెంచ్కు అధ్యక్షత వహించిన బిసి గుప్తా స్పష్టం చేశారు..