Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్, బీఏఏ
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో శాంతియుతంగా నిర్వహిస్తున్న కిసాన్ ర్యాలీపై పోలీసుల దాడిని భూమి అధికార్ ఆందోళన్(బీఏఏ), ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ఖండించాయి. ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా రైతులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమని తెలిపాయి. రైతుల రుణాలు మాఫీ చేయాలని, పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న(మంగళవారం) రారుపూర్లో కిసాన్ ర్యాలీ నిర్వహించాలని ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్, కిసాన్ సంఫ్ు, ఏఐకేఎస్లు నిర్ణయించాయి. ఈ ర్యాలీకి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. కాగా.. ర్యాలీ తీస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలను పోలీసులు.. రాజనందగాన్ వద్ద అడ్డుకుని లాఠీచార్జి చేశారు. పలువురిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే.. పోలీసులు అరెస్టు చేసిన రైతు సంఘాల నేతలను వెంటనే విడిచిపెట్టాలని, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఏఐకేఎస్, బీఏఏ డిమాండ్ చేశాయి.