Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామి కుశలేంద్రపై లైంగికదాడి కేసు
జైపూర్ : ఆధ్యాత్మిక ముసుగువేసుకొని అమ్మా యిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి జాబితాలో మరో బాబా చేరాడు. రాజస్థాన్కు చెందిన బాబా తనపై లైంగికదాడికి పాల్పడినట్టు ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్కు చెందిన 21 ఏండ్ల యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో స్వామి కుశలేంద్ర ఫలాహరి మహరాజ్ (70)పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. గత నెల 7న కుశలేంద్ర బాబా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. రాజస్థాన్లోని అల్వార్లో కుశలేంద్రకు సొంత ఆశ్రమం ఉంది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్కు చెందిన ఆ యువతి ఈ మధ్యే తన న్యాయ విద్యను పూర్తి చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు కుశలేంద్ర భక్తులు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న ఆ యువతి ఆశ్రమానికి వెళ్ళగా ఈ దారుణం జరిగినట్టు ఫిర్యాదులో పేర్కొందని ఆల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. ఆమెను తన మందిరంలో కాసేపు వేచి ఉండాలని చెప్పిన బాబా.. తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కుశలేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు ఆశ్రమానికి వెళ్ళారు. కాగా, ఆనారోగ్యంగా ఉందంటూ స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత బాబాను ప్రశ్నిస్తామన్నారు.