Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన తల్లినీ హత్యగావించిన దుండగులు
ఛండీగఢ్: పంజాబ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కెజె సింగ్ హత్యకు గురయ్యారు. మొహాలీలోని తన ఇంట్లో సింగ్తోపాటు ఆయన తల్లి గురు చరణ్కౌర్ను దుండగులు హత్యగావించారు. వీరు హత్యకు గురైన విషయాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో సింగ్ బంధువులు గుర్తించి పోలీసులకు సమా చారమి చ్చారు. కెజె సింగ్ను పొట్టలో కత్తితో పొడిచి, గొంతు కోసిన దుండ గులు ఆయన తల్లి కౌర్ను గొంతునులిమి చంపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద హత్యగా భావించిన పంజాబ్ ప్రభు త్వం ఐజీస్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ఆదేశించింది. కెజెసింగ్ ఇంటికి రెండు ఇండ్ల తర్వాత ఏర్పాటు చేసిన సీసీకెమెరా ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తు న్నారు. అవివాహితుడైన కెజె సింగ్..ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ ఎడిటర్గా పని చేశారు. ప్రస్తుతం కెనడాకు చెందిన పత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గాసింగ్ పనిచేస్తున్నారు.
జర్నలిస్ట్ శంతన్ హత్య భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి : ఆమ్నెస్టీ
త్రిపురలో జరిగిన జర్నలిస్ట్ శంతన్ భౌమిక్(28) హత్యను భావప్రకటనా స్వేచ్చ Ûపై దాడిగా మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. శంతన్ హత్యలో దోషులను చట్టం ముందుకు తేవడం ద్వారా జర్నలిస్టులపై మరిన్ని దాడులు జరగ కుండా అడ్డుకోవాలని ఆమ్నెస్టీ భారత విభాగానికి ప్రోగ్రాం మేనే జర్గా పని చేస్తున్న అరిజిత్సేన్ కోరారు. ఈనెల 20న త్రిపురలోని మండయిలో ఇండీజినస్ పీపు ల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర చేపట్టిన ఆందోళ నను రిపోర్ట్ చేస్తుండగా, అపహరణకు గురైన శంతన్ ఆ తర్వాత తీవ్ర గాయాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల మొదటివారంలో బెంగళూరులో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్యోదం తం మరవకముందే శంతన్పై దాడి సంఘటన చోటుచేసుకున్నది. భారత్లో 1992 నుంచి జరిగిన 27మంది జర్నలిస్టు ల హత్యా సంఘటనల్లో ఏ ఒక్క కేసులోనూ దోషులను శిక్షించలేదని ఆమ్నెస్టీ తెలిపింది.