Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడు బేటీలం పిలుస్తున్నాం.. రండి..
- విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న బీహెచ్యూ
- రక్షణ కల్పించాలని డిమాండ్
వారణాసి : 'గంగామాత పిలిస్తే వారణాసి వచ్చామన్నారు... ఇప్పుడు ఆ మాత బేటీలం పిలుస్తున్నాం... మా వర్సిటీకి రండి.. మా సమస్యలు స్వయంగా తెలుసుకోండి.. మాకు రక్షణ కల్పించండి..' అంటూ విద్యార్థినులు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) అట్టుడుకుతున్నది. ఈ యూనివర్సిటీలో ఇంత ఎద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళనలకు దిగడం ఇదే ప్రథమం. ప్రధాని మోడీ వారణాసి పర్యటనలో ఉండగా.. విద్యార్థులు ఆందోళనలు ఉధృతమయ్యాయి. వారణాసిలో ఉన్న మోడీ వర్సిటీకి రావా లని, తమ పరిస్థితి ఒక్కసారి చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీసీ బయటకు రావాలనీ, మా రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని వారు కోరుతున్నారు. విద్యార్థినిపై హాస్టల్వద్ద లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నేపథ్యంలో విద్యార్థులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఫిర్యాదుచేసినా నిందితులపై చర్యలు తీసుకోవ డంలో వైస్ చాన్స్లర్ విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నా రు. వైఎస్ చాన్స్లర్ను తొలగించాలని, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్లో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని విమ ర్శించారు. 'వైఎస్ చాన్స్లర్ మా సమస్యలు తెలుసు కోవాలి, మా డిమాండ్లువినాలి...' అని ఒక విద్యార్థిని చెప్పారు.
ఆందోళనకు కారణం..
ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఈ నెల 21న సాయంత్రం ఆరుగంటల సమయంలో హాస్టల్ బయట ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బైక్ మీద ఉన్న వారు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె వర్సిటీ ప్రోక్టర్కు ఫిర్యాదు చేసేందుకు అతని కార్యాలయానికి వెళ్ళింది. కాగా, ప్రోక్టర్ ఆమెనే తప్పుపడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గంటల తర్వాత బయటకు రావడమేంటని ప్రోక్టర్ ఆమెనే తప్పుపట్టారు. వెంటనే అక్కడి నుంచి హాస్టల్కు చేరుకున్న ఆమె సహచర విద్యార్థులకు విషయం చెప్పింది. అదే రోజు అర్ధరాత్రి నుంచి వీసీ కార్యాలయం ముందు విద్యార్థులు ఆకస్మిక ఆందోళనకు దిగారు. ఆకస్మిక పరిణామంతో వర్సిటీ అధికారులు విస్తుపోతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన బాధితురాలి స్నేహితురాలు గుండు గీయించుకుని మరీ నిరసన వ్యక్తం చేస్తున్నది. నెలకోసారి తాను గుండు గీయించుకుంటానని ఆమె అంటున్నారు. అందంగా కనిపించకుండా ఉండటానికి, వేధింపులు, ఈవ్టీజింగ్ నుంచి కాపాడుకోవడానికి ఇదొక మార్గంగా తమకు తోస్తోందని ఆమె చెప్పారు.
సర్వసాధారణమైపోయింది...
'బీహెచ్యూలో మహిళలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ప్రతీ రోజూ విద్యార్థులు ఇలాంటి ఘటనలనే ఎదుర్కొంటున్నారు' అని మరో విద్యార్థిని చెప్పారు. ఈ వేధింపులు తట్టుకోలేక కొందరు విద్యార్థినులు చదువు మానేసి మధ్యలోనే వెళ్ళిపోతున్నారని ఆమె చెప్పారు. వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోకపోతే.. మేము కూడా చదువులు మానుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేస్తే... అమ్మాయిలనే తప్పుపడుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎవరు చేస్తారు... వారి ఆగడాలకు అడ్దుకట్ట ఎలా పడుతుంది? అని ఆమె ప్రశ్నించారు.