Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో, పక్కాప్రణాళికతో నియంత్రణ రేఖ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కల్గారు ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక ఆపరేషన్ ముగిసినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. మిలిటెంట్లు లష్కర్-ఎ-తొయిబా ఉగ్రసంస్థకు చెందిన సభ్యులని అనుమానిస్తున్నామని అన్నారు.