Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి లేఖ రాసిన లైంగికదాడి బాధితురాలు
- ఇద్దరు స్కూలు సిబ్బంది అఘాయిత్యం..
చంఢగీఢ్: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హర్యానాలో ఓ విద్యార్థినిపై ఇద్దరు స్కూలు సిబ్బంది లైంగికదాడికి ఒడిగట్టారు. దీంతో న్యాయం కోరుతూ బాధితురాలు.. ప్రధాని మోడీకి ఆదివారం లేఖ రాశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ లేఖ చక్కర్లు కొడుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోనిపట్
జిల్లా గోహానాలోని ప్రయివేటు స్కూలులో పని చేస్తున్న ఇద్దరు కరంవీర్, సుఖ్వీర్లు.. ఇటీవల ఓ విద్యా ర్థినిపై లైంగికదాడికి ఒడిగట్టారు. కాగా ఆ ఇద్దరు దుర్మార్గులతో పాటు స్కూలు యాజ మాన్యంపై బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ప్రధాని మోడీకి మెయిల్ ద్వారా లేఖ పంపారు. అంతేకాక, ఆ లేఖను వాట్సాప్లో షేర్ చేసింది. ఇదిలా ఉండగా ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ముఖేశ్ జఖాద్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేపట్టేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.