Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పప్పుధాన్యాల్లోనూ 70వేల టన్నుల క్షీణత
- పత్తి, నూనెగింజల ఉత్పత్తిలోనూ..
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఆహార, వాణిజ్య పంటల దిగుబడి తగ్గిపోయింది. వరి దిగుబడి గతేడాది 96.39 మిలియన్ టన్నులు నమోదు కాగా, ఈ ఏడాది 94.48 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్నట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పలు రాష్ట్రాల్లో వరదల బీభత్సం, మరికొన్ని ప్రాంతాల్లో అల్ప వర్షపాతం, ఇంకొన్ని చోట్ల వర్షపాతమే నమోదు కాకపోవడం తాజా పరిణామాలకు కారణమని పేర్కొన్నారు. గతేడాది ఆహార ధాన్యాల దిగుమతి 138.52 మిలియన్ టన్నులు ఉండగా, ఈ ఏడాది 134.67 మిలియన్ టన్నులుగా నమోదైంది. వాణిజ్య పంటలైన పప్పుదినుసులు, గోధుమల దిగుమతి తగ్గిపోయినట్టు ఆ అధికారి తెలిపారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో 9.42 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుబడి కాగా, ఈఏడాది 8.71 మిలియన్ టన్నులుగా నమోదైందని అన్నారు. పత్తి దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. గత ఖరీఫ్ సీజన్లో 33.09 మిలియన్ బేళ్లలో నమోదు కాగా, ఈ ఏడాది 32.27గా నమోదైంది. నూనె గింజలు గతేడాది ఖరీఫ్లో 22.40 మిలియన్ టన్నులు ఉండగా, ఈ ఏడాది 20.68 మిలియన్ టన్నులుగా రికార్డయింది. చెరుకు సాగు మాత్రం కాస్త ఊరట నిచ్చింది. గతేడాది ఖరీఫ్ సీజన్లో చెరుకు సాగు 306.72 మిలియన్ టన్నులు నమోదు కాగా, ఈ ఏడాది 337.69 మిలియన్ టన్నులు నమోదైంది. గతేడాది దిగుబడి కంటే ఈఏడాది 30.97 మిలియన్ టన్నులు పెరిగింది. ఈ ఏడాది అస్సాం, బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో పంటల దిగుబడి తగ్గిపోయింది. ఓ వైపు రైతులు నష్టాల్లో కూరుకుపోతుండగా.. మరోవైపు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆహార ఉత్పత్తులను రోడ్లపై పడేస్తున్నారు. దేశంలోని రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కార్ విదేశాల నుంచి భారీగా ఆహార ఉత్పత్తుల దిగుమతుల వైపు ఉత్సుకత చూపుతున్నదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.న