Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ప్రభుత్వం తక్షణమే తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. ఫలితంగా ముంబయి, పూనె, రత్నగిరీ, షోలాపూర్, థానె డిపోల్లోనే దాదాపు 17వేల బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు.