Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో జరుగుతు న్న ఇసుక అక్రమ రవాణా కేసులో నవంబర్ 23న తుది వాదనలు వింటామని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) పేర్కొంది. అప్పటిలోగా ఈ రాష్ట్రాల్లో గత ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘన జరిగితే కోర్టు ధిక్కరణ కింద దరఖాస్తు దాఖలు చేయాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. ఇసుక అక్రమ రవాణాను నిలు పుదల చేయాలని కోరుతూ రేలా అనే స్వచ్ఛందసంస్థ గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ జరిపిన ఎన్జీటీ.. యంత్ర పరికరాలతో ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి కేసు విచారణ నిలిచిపోయింది. ఈనేపథ్యంలో కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని, ఈరాష్ట్రాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను నిలుపుదల చేయాలని తాజాగా పిటిషనర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఎన్జీటీ చైర్మెన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం విచారిం చింది. ఇసుక కేసు విచారణ ఎన్జీటీలో నిలిచిపోవడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో మళ్లీ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ వాదించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని నేరళ్లలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. లారీల ద్వారా ఇష్టారీతిన ఇసుకను తరలిస్తు న్నారని వాదించారు. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సైతం నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అక్రమ రవాణా వల్ల నదులకు ఏర్పడ్డ నష్టాన్ని నివారించేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.