Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో హోంమంత్రికి చేదు అనుభవం
జైపూర్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాజస్థాన్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటన సందర్భంగా 250మంది పోలీసు కానిస్టేబుళ్లు మూకుమ్మడి గా సెలవు తీసుకున్నారు. వీరిలో రాజ్నాథ్కు గౌరవ వంద నం సమర్పించాల్సిన వారు సైతం ఉన్నారు. వీరి స్థానంలో అప్పటికప్పుడు వేరే పోలీసులను తీసుకోవాల్సి వచ్చింది. వాట్సాప్లో చక్కర్లు కొట్టిన ఓ మెసేజ్ ఈ పరిస్థితికి కారణ మని తెలుస్తున్నది. పోలీసు శాఖకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. దీని ప్రకారం.. కానిస్టేబుళ్ల వేతనాల్లో కోతపడే అవకాశముందంటూ సోషల్మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే.. జోథ్పూర్లోని ఇంటెలిజెన్స్ బ్యూరో రీజినల్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారం భించేందుకు రాజ్నాథ్సింగ్ సోమవారం వెళ్లారు. కాగా.. ఆయనకు గౌరవ వందనం సమర్పిం చాల్సిన వారితో సహా 250 మంది సెలవులో వెళ్లిపోయారు. దీంతో హడావిడిగా వేరే పోలీసులను నియమించి గౌరవ వందనం ప్రక్రియను ముగించాల్సి వచ్చిందని పోలీస్ కమిషనర్ అశోక్ రాథోడ్ వెల్లడించారు. వీరిలో ఎవరికీ సెలవు మంజూరు చేయలేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు సెలవు పెట్టిన వారి లో కొందరు పోలీసులు తప్పకుండా హాజరు కావాలం టూ ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశామని రాష్ట్ర డీజీపీ అజిత్ సింగ్ వెల్లడించారు. సెలవు పెట్టిన వారందరికీ నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నా రు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని రాజస్థాన్ హోంశాఖ మంత్రి గులాబ్చంద్ కటారియా అన్నారు.
ప్రకటన చేయని ప్రభుత్వం
జీతం రూ.24వేల నుంచి రూ.19వేలకు తగ్గించబోతు న్నారని వాట్సాప్ కేంద్రంగా వచ్చిన వార్తలపై ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయలేదని సెలవులో వెళ్లిన పోలీ సులు తెలిపారు. తమ ఆవేదనను తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు చెప్పారు. అంతేకాక.. జైపూర్ లోని సివిల్ లైన్స్ మెట్రోస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది పోలీసులు సోమవారం గుండ్లు కొట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. జీతాల్లో కోతపై నిరసన తెలిపిన తమ సహోద్యోగులు ఆరుగురిని బదిలీ చేశారని వారు ఆరోపించారు.