Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో బాణాసంచా పంపిణీ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి
- సుప్రీం తీర్పుకూ మతం రంగు పులిమే కుటిలయత్నాలు
న్యూఢిల్లీ : బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజీందర్ బగ్గా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హరీనగర్ ప్రాంతంలో చిన్నారులకు టపాసులు పంపిణీ చేస్తున్న ఓ వీడియోను తజీందర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అంతేగాకుండా, బాణాసంచా అమ్మకాలపై సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు హిందూ పండుగలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇచ్చినట్టుగా ఉందన్నారు. టపాసులను పేల్చడంతో కేవలం 0.3శాతం మాత్రమే వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఐఐటీ స్టడీ చెబుతోందని అన్నారు. కాగా, సుప్రీం తీర్పునకూ మతం రంగు పులిమేందుకు తజీందర్ కుటిలయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత శోభ ఓజా విమర్శించారు. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించాలని హితవు పలికారు. ఢిల్లీలో, జాతీయ రాజధాని ప్రాంతంలో వచ్చేనెల 1వరకు బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
'వాయు కాలుష్య రహిత టపాసులను తయారు చేయండి'
భారత శాస్త్రవేత్తలంతా వాయు కాలుష్య రహిత టపాసుల తయారీపై దృష్టి పెట్టాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. వాయు కాలుష్య రహిత బాణాసంచా మార్కె ట్లోకి వచ్చినట్టయితే వినియోగదారుల అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని అన్నారు. ఇలాంటి టపాసుల ఉపయో గంతో వాతావరణ కాలుష్యానికి ఎలాంటి విఘాతం ఏర్పడదన్నా రు. తద్వారా, ప్రజల అసౌకర్యాన్ని తొలగించవచ్చని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఢిల్లీలో, జాతీయ రాజధాని ప్రాంతంలో వచ్చేనెల1 వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం ఉన్నదన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతర్ చేసి యధేచ్ఛగా బాణాసంచా విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను గుర్గామ్ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు.