Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలేషన్ కొనసాగించు
- జైనముని పెట్టిన వేధింపులను బయటపెట్టిన బాధితురాలు
సూరత్ : జైనముని శాంతిసాగర్ పెట్టిన మరి న్ని వేధింపులను లైంగికదాడి బాధితురాలు బయ టపెట్టింది. భక్తుల ముందు సుఖం, శాంతి మాటలు చెప్పే జైనముని నగంగా ఉన్న ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపమని బలవంతం చేసేవాడని తెలిపింది. లీగల్ కౌన్సెలర్, గైనకాలిజిస్టు, సైకాలజిస్టులకు ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రు లు సుఖంగా, ఎలాంటి ఇబ్బందుల్లేని జీవితం గడపా లంటే జపం చేయాలని జైనముని ఆ యువతికి సూచించాడు. ఆసమయంలో భయపెట్టి బలవం తంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. 19ఏండ్ల యువతి, కుటుంబసభ్యుల తో కలసి ఈఏడాది మార్చి 31న ఆచార్య శాంతి సాగర్ను కలిశారు. ఆయన చెప్పే బోధనలకు మంత్రముగ్దులయ్యామని ఆమె తెలిపింది. దాన్ని అదనుగా తీసుకున్న జైనముని శాంతిసాగర్ ఎస్ఎం ఎస్లు, వాట్సాప్లు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు ఫోన్ కూడా చేసేవాడు. ముందుగా ఫోటోలు వాట్సాప్లో పంపమని అడిగితే.. సుఖం, శాంతి కోసమని అనుకునే దానినని బాధితురాలు తెలిపింది. నన్ను స్నేహితుడిగా భావించు.. ఓ నగ ఫోటోను వాట్సాప్లో పంపాలని, విధికార్యంలో ఇది తప్పనిసరని జైనముని ఆమెకు చెప్పాడు. ఓ రోజు ఆ కుటుంబం మొత్తాన్ని ఆశ్రమానికి పిలిపించాడు. తలిదండ్రులను, సోదరుడ్ని వేరు గదుల్లో ఉంచాడు. 'నువ్వు ఏం కోరుకుంటున్నావని అడిగితే.. మా కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే నా అభిమత మని చెప్పాను. అలా అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని నా దుస్తులను తొలగించాడు. భయపెట్టి లొంగ దీసుకున్నాడు' అని ఆమె వాపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులు చనిపోతారని జైనముని చెప్పాడనీ ఆమె వివరించింది. జైనముని శాంతిసాగర్ మధ్యప్రదేశ్ గునా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. అతను చిన్నప్పుడు టీ అమ్ముకునే వాడని, అతని అసలు పేరు గిరిరాజ్ శర్మ అని స్నేహితులు తెలిపారు. అతను చేసిన దారుణం వెలుగుచూశాక.. జైనముని అసలు రూపమదేనని అతని మిత్రులు అంటున్నారు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో కటకటాలను లెక్కపెడుతున్నాడు.