Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళపై సంఘీయులది తప్పుడు ప్రచారం
- ఈ ఒక్క యేడాదే 85 మంది సీపీఐ(ఎం) కార్యకర్తల హత్య
- అన్ని రంగాల్లో ముందుందనే వామపక్ష ప్రభుత్వంపై అక్కసు : ఢిల్లీలోని నిరసన ర్యాలీలో ఏచూరి వ్యాఖ్యలు
- బీజేపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు: వి శ్రీనివాసరావు
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
హింస, ఉన్మాదం ఆధారంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు(ఆర్ఎస్ఎస్), బీజేపీ రాజకీయంగా, సామాజి కంగా ఎదిగాయని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. కేరళలో మొదటి నుంచి హింసా రాజకీయాలకు పాల్పడింది సంఘీయులేనని అన్నారు. కానీ నేడు ఉల్టా చోర్ కోత్వాల్ కో డాటా అన్నట్టు సీపీఐ(ఎం)పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, మహిళా రక్షణ, మానవ అభివృద్ధి సూచీ ఇలా అన్నింటిలో అగ్రభాగన ఉందనే అక్కసుతోనే కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వంపై బీజేపీ నేతలు దుష్ప్రచా రం చేస్తున్నారని విమర్శించారు. కేరళలో బీజేపీ అధికారం లో లేనందుకే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోం దని చెప్పారు. 70 యేండ్ల స్వాతంత్య్రం తరువాత బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు సాధించిందని... కేరళపై ఈ విధమైన తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ సీటునూ కోల్పోవడం ఖాయమని అన్నారు.
సీపీఐ(ఎం) కార్యాలయాలపై బీజేపీ నేతల దాడి, కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై దుష్ప్రచారం నిరసిస్తూ పార్టీ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. వీపీ హౌస్ నుంచి అశోకారోడ్డులోని బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, బివి రాఘవులు, ఎంపీ ఎండీ సలీం, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, కేంద్రకమిటీ సభ్యులు అరుణ్, ఢిల్లీ రాష్ట్రకార్యదర్శి తివారీ ర్యాలీ అగ్రభా గాన నిలిచారు. 'అమిత్షా.. కేరళలో హింసను పెంచడం ఆపేయి' 'ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం నశించాలి' 'సంఫ్ు గూం డాలు డౌన్డౌన్' 'కేరళ, త్రిపురలో బీజేపీ ఆటలుసాగవు' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. న్యూఢిల్లీలోని ప్రధాన వీధుల గూండా ఈ ర్యాలీ సాగింది. చివరకు బీజేపీ ప్రధాన కార్యాలయ సమీపంలో పోలీసులు బ్యారీకేడ్లతో ర్యాలీని నిలుపుదల చేశారు. ఈసందర్భంగా ర్యాలీని ఉద్దేశిం చి సీతారాం ఏచూరి మాట్లాడారు. 'జనరక్ష యాత్ర పేరిట కేరళలో రెండు వారాల పాటు యాత్ర చేస్తామని చెప్పిన అమిత్షా... రెండు రోజులకే పారిపోయారు' అని ఎద్దేవా చేశారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న కొడుకును రక్షిం చేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని చురకలంటించారు. 'కేరళలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే... సీఎం పినరయి విజయన్ విజయోత్సవ ర్యాలీపై ఆర్ఎస్ఎస్ మూకలు బాంబుదాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో హింసను మొదట ప్రారంభించింది ఆర్ఎస్ఎస్సే' అని ఏచూరి వివరించారు. ఒక్క కేరళలోనే కాదని, దేశవ్యాప్తంగా మత ఘర్షణల్లో, హింసాత్మక దాడుల్లో సంఫ్ు, బీజేపీ నేతల పాత్రలను న్యాయమూర్తులు నిర్ధారించారని గుర్తు చేశారు. ఇక కేరళలో సీపీఐ(ఎం) సర్కారును దించేస్తామన్న బీజేపీ నేతల హెచ్చరికలను ఏచూరి తిప్పికొట్టారు. 'ఎర్రజెండాను దించాలని చాలా శక్తులు ప్రయత్నించాయి. హిట్లర్ పార్లమెంట్పై సైతం ఎర్రజెండా ఎగరేసిన చరిత్ర మాది. ఈ ప్రపంచాన్ని ఫాసిజం నుంచి కాపాడింది ఈ ఎర్రజెండా' అని అన్నారు. హిట్లర్ లా పాలన చేస్తే హిట్లర్ లాంటి మరణం తప్పదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోడీ సర్కారు పాల్పడుతున్న దోపిడీ, అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేరళపై దుష్ప్రచారానికి దిగారని ఎంపీ ఎండీ సలీం విమర్శించారు. పెరుగుతున్న ధరలు, కాశ్మీర్లో ఉగ్రదాడులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం, జీఎస్టీ, నోట్లరద్దు ఇలా అన్ని అంశాల నుంచి చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడంలో భాగంగా సీపీఐ(ఎం) కార్యాలయాల పై దాడికి ఒడిగడుతున్నారని విమర్శించారు.
బీజేపీని జనం ఛీకొడుతున్నారు - వి శ్రీనివాసరావు
ప్రజలు బీజేపీని అసహ్యిం చుకుంటున్నారని కేంద్రకార్యద ర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాస రావు అన్నారు. కేంద్రంలో అధి కారంలో ఉండి ఈ మూడేండ్ల లో ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వివరించారు. 'కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడకూడదని ఓ ఎత్తుగడగా సీపీఐ(ఎం) కార్యాలయాలపై దాడులకు పాల్ప డుతున్నారు. కానీ అటు కేరళలో, ఇటు ఢిల్లీలో బీజేపీకి ఏ ఒక్క పార్టీ మద్దతివ్వడం లేదు. స్వంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది' అని వివరించారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఈ మూడేండ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్తామని శ్రీనివాసరావు చెప్పారు.