Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ సంజరుకకడే
ముంబయి:గుజరాత్లో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు రావని అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజరుకకడే వ్యాఖ్యానిం చారు. మరోవైపు కాంగ్రెస్కు మెజారిటీ కి తగినన్ని సీట్లు వచ్చే అవకాశమున్నదని కకడే అన్నారు. ఆరుగురు వ్యక్తులతో కూడిన ఓ బృందంతో గుజరాత్లో సర్వే చేయించినట్టు కకడే తెలిపారు. వాళ్లంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేశారని ఆయన చెప్పారు. తన సర్వే బృందం రైతులు, డ్రైవర్లు, కూలీల నుంచి అభిప్రాయాలు సేకరించారని కకడే తెలిపారు. సర్వే ఆధారంగానే తన అంచనా చెబుతున్నానని కకడే అన్నారు.
గుజరాత్లో 22 ఏండ్ల బీజేపీ పాలన పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్లే ఓటర్ తీర్పు ఈ విధంగా ఉండనున్నట్టు ఆయన తెలిపారు. చివరిదశ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలెవరూ అభివృద్ధి గురించి మాట్లాడలేదని కకడే గుర్తు చేశారు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఉద్వేగపూరిత ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారే తప్ప... ఉద్యోగాల కల్పన, గత మూడేండ్లలో పార్టీ తీసుకున్న ప్రధాన నిర్ణయాల గురించి మాట్లాడలేకపోయారని కకడే అన్నారు. మరోవైపు జాతీయ మీడియా సంస్థల సర్వే నిర్వాహకులు మాత్రం గుజరాత్, హిమాచల్ప్రదేశ్ల్లో బీజేపీకే తగిన మెజారిటీ వస్తుందని అంచనా వేశారు.