Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాట జల్లికట్టు 'జూలు విదిల్చింది. ఇది హింసాత్మకం అంటూ జంతు ప్రేమికులు గొడవ చేస్తున్నా, సుప్రీంకోర్టు అడ్డుపడుతున్నా లెక్కచేయని వీరాభిమానులు బరిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మధురైలో జరిగిన జల్లికట్టు 'ఉత్సవానికి' ముఖ్యమంత్రి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరై విజేతలకు ఏకంగా బహుమతులు ప్రకటించడం విశేషం. సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జట్టుకట్టు కార్యక్రమంలో నలుగురి మృతిచెందారు. మధురై, శివనాగాంలలో సోమవారం జల్లికట్టుకు హాజరైన ఇద్దరు యువకులను పోట్ల గిత్తల దాడిలో మృతి చెందారు. మంగళవారం మరో ఇద్దరు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. జల్లికట్టు జరిగే ప్రాంతమంతా ఏఐఏడీఎంకే నాయకులతో, మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్టిక్కర్లతో నిండిపోయింది. కాగా జల్లికట్లుపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమవడంతో సుప్రీం కోర్టు గతంలో దీన్ని నిషేధించింది. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండగా జల్లికట్లు నిర్వహణకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. పశువైద్యులు ఉత్ప్రేరకాలు వాడకుండా ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేశారని అధికారులు పేర్కొంటున్నారు.