Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ యువ మోర్చా కార్యకర్తలపై ప్రకాశ్రాజ్ ఆగ్రహం
కర్నాటక: సిర్సిలోని రాఘవేంద్ర మఠంలో వామపక్ష మేధావులు ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. 'మన రాజ్యాంగం- మన హోదా' పేరుతో జరిగిన ఈ సమావేశం అనంతరం ఆయన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డెపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆ సమావేశ ప్రాంగణాన్ని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు సంక్రాంతి పండుగ రోజు గో మూత్రంతో శుద్ధి చేశారు. తమ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారని, అందుకే గోమూత్రంతో శుద్ధి చేశామని బీజేపీ యువ మోర్చా స్థానిక నేత విశాల్ మరాటె అన్నారు. 'ఇటువంటి అసాంఘిక వామపక్ష మేధావులను సమాజం క్షమించదు' అని వ్యాఖ్యానించారు. కాగా దీనిపై ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. నేను ఎక్కడికివెళితే అక్కడ గో మూత్రంతో శుద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. గతేడాది అక్టోబర్లో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య నేపథ్యంలో ప్రధాని మోడీ, బీజేపీపై ప్రకాశ్ రాజ్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఆయనపై విరుచుకుపడుతూనే ఉన్నారు.