Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలకత్తా హైకోర్టు న్యాయవాదుల హెచ్చరిక
కోల్కతా: ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవుల్లో నియామకాలు చేపట్టాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని కలకత్తా హైకోర్టు న్యాయవాదులు హెచ్చరించారు. కలకత్తా హైకోర్టులో 72 మంది జడ్జీలు ఉండాలనీ, కానీ ప్రస్తుతం సగానికి తక్కువ మది ఉన్నారని కలకత్తా హైకోర్టు బార్ అసోసియేషన్ తెలిపింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉత్తమ్ మజుందార్ విలేకరులతో మాట్లాడుతూ.. నెలలోపు న్యాయమూ ర్తుల సంఖ్యను కనీసం 50 మందికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్కు లేఖలు రాశామన్నారు.